ఇళ్ళ పట్టాలు ఇచ్చారు గానీ జాగా ఎక్కడ.?

పిఠాపురం, మోహన్ నగర్లో ముస్లింలకు వైశిపి ప్రభుత్వం పట్టాలు ఇచ్చి 3 ఏళ్లు గడిచాయి. ఇప్పటివరకు మాకు జాగా చూపలేదు
అని బాధితులు వాపోతున్నారు. జనసేన-తెలుగుదేశం కలపి గురువారం పిఠాపురం మునస్పల్ కార్యాలయంలో కమిషనర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కమిషనర్ సానుకూలంగా స్పందించి రెండు మూడురోజులలో సమస్యకు పరిష్కారం చూపుతానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, టైల్స్ బాబీ, బుర్ర ప్రకాష్, కసిరెడ్డి నాగేశ్వరావు, పెద్దిరెడ్ల భీమేశ్వరావు, ఎం.సూరిబాబు, వినకొండ అమ్మాజీ, ముప్పన రత్నం, మేడిశెట్టి నాగమణి, పి.ఎస్.ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.