ఎన్ని రాజుని సత్కరించిన పాలకొండ జనసేన నాయకులు
పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ వైజాగ్ లో నిర్వహించదలిచిన జనవాణి కార్యక్రమంలో వైజాగ్ లో జరుగుతున్న భూ కబ్జాలు, దందాలు, అక్రమాలు ప్రజలు పడుతున్న అవస్థలు కష్టాలు జనసేన అధ్యక్షులు పవన్కళ్యాణ్ కి తెలిస్తే మళ్ళీ ఈ ప్రభుత్వంపై విరుచుకు పడతారని తెలిసి జనవాణి కార్యక్రమం జరగకుండా జనసేన నాయుకులను కార్యకర్తలను అర్ధరాత్రి సమయంలో అక్రమంగా అరెస్ట్లు చేసి జైలుకి తీసుకొని వెళ్లగా మన వకిల్ సాబ్ అయిన ఎన్ని రాజు తనదైన శైలిలో మన నాయకులపై పెట్టిన అక్రమ కేసుల నుండి సుమారు 90 మందికి స్టేషన్ బెయిల్ మరియు ముఖ్య నాయకులకు శిక్ష తగ్గించే విధంగా తన వాదనలు వినిపించడంలో ముఖ్యపాత్ర పోషించిన మన వకీల్ సాబ్ ఎన్ని రాజుని శనివారం పాలకొండ నియోజకవర్గం నుంచి బాసురు లక్ష్మీపురం సీతంపేట వీరఘట్టం పాలకొండ టౌన్ నాయుకులు మర్యాదపూర్వకంగా దుశ్శాలువలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గంలో లీగల్ గా ఏ విధమైన ఆటంకం కలిగిన ఏ అర్ధరాత్రి అయినా వచ్చే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-29-at-13.44.26-1024x768.jpeg)