లబ్ధిదారులే కట్టుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసం: మేకల ఈశ్వర్
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమంతో 12, 13, 14 తేదీలలో ఓడిసి మండలంలో ఎక్కడైతే జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ప్లేసులు చూపించి ఇప్పటివరకు వారికి ఇల్లు ఎంత వరకు లబ్ధిదారులకు అందజేశారనే వాస్తవాలను ప్రజలకు తెలిసే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తాం, జగనన్న కాలనీలు అక్కడ ఎటువంటి సదుపాయాలు లేని కొండల్లో, అడవుల్లో స్థలాలు ఇచ్చి లబ్ధిదారులే కట్టుకోవాలని వాలంటీర్లు ద్వారా బెదిరిస్తున్నారని, గతంలో ప్రభుత్వం కట్టిస్తాం అని చెప్పి ఇప్పుడు లబ్ధిదారులే కట్టుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని జనసేన పార్టీ మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్ దుయ్యపట్టారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కొండబోయన సతీష్, ప్రసాద్, బాబ్జాన్, వీరయ్య, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-11-at-16.35.10.jpeg)