యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో భారీ అన్నప్రాసద వితరణ

రాజంపేట, శ్రీ దేవరకొండ భానుమూర్తి శర్మ స్వామి రాజంపేట మండలం హస్తవరం చెర్లోపల్లి నుంచి తలపెట్టిన 31వ తిరుమల మహా పాదయాత్ర సోమవారం తిరుమల చేరుకున్న సందర్బంగా డి.ఆర్.డి.ఏ మాజీ అధికారి, రాజంపేట నియోజకవర్గం జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు తిరుమల క్షేత్రంలో పాదయాత్ర భక్తులకు సుమారు 5000 మందికి అన్నదానము, ప్రసాదాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా దేవరకొండ భానుమూర్తి శర్మ మాట్లాడుతూ భవిష్యత్తులో శ్రీనివాసరాజు ఉన్నత పదవులు అలంకరించి ప్రజాసేవలో తరించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ భానుమూర్తి శర్మ వంటి ఆధ్యాత్మిక గురువు పాదయాత్రలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకైనా తన వంతు సహాయ సహకారాలు అందచేస్తానని తెలిపారు.

బోరుకు మరమ్మతులు చేయించిన యల్లటూరు శ్రీనివాస రాజు

రాజంపేట, సుండుపల్లె మండల పరిధిలోని జిరెడ్డి వారి పల్లి పంచాయతీ కొత్త ఇండ్లు గ్రామంలో బోరుకు తన సొంత నిధులతో రాజంపేట జనసేన పార్టీ నేత యల్లటూరు శ్రీనివాస రాజు మరమ్మతులు చేయించడం జరిగింది. తమ గ్రామంలో బోరు ఉందని అది పురాతనం కావడంతో తాగునీటి సమస్య తలెత్తుకుండా ఉండేందుకు నూతన సామాగ్రిని అందించి బోరుకు మరమ్మతులు రాష్ట్ర డిఆర్డిఏ మాజీ అధికారి జనసేన పార్టీ నేత యల్లటూరు శ్రీనివాసరాజు చేయించడంజరిగిందని తెలిపారు. బోరుకు నీళ్లు కావాలని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తన సొంత నిధులతో బోరుకు అదనపు పైపులతోపాటు సామాగ్రి అందజేయించి మరమ్మతులు చేసి తాగునీటి సౌకర్యం కల్పించారు దీంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మనోహర్, అబ్దుల్లా, హరీష్, శంకర్ కృష్ణ, రాజా, రామకృష్ణ, సురేష్, గౌతం బాబు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.