ముమ్మిడివరం నియోజకవర్గం క్రాప చింతలపూడి గ్రామంలో జనసేన పార్టీలో చేరికలు

ముమ్మిడివరం నియోజకవర్గం క్రాప చింతలపూడి గ్రామంలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ మరియు పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పార్టీలో జాయిన్ అయిన SC, BC వర్గాలకు చెందిన యువకులు మరియు మహిళలు పార్టీ కండువా కప్పుకున్నారు. కుల రహిత సమాజం ఏర్పాటు చేయడం కోసం అన్ని కులాలను ఒక తాటిపైకి తేవడానికి తూర్పుగోదావరి జిల్లాలో పాటుపడే వ్యక్తి పితాని బాలకృష్ణ. పార్టీలో ముందునుండి ఉంటూ పార్టీకి ఆయన చేసిన సేవలు ప్రముఖంగా చెప్పవచ్చు. ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసైనికులని ఒక తాటిపై తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధిలో తనవంతు కృషి చేస్తున్నారు.