తీన్మార్ మల్లన్నకు మద్దతుగా హుస్నాబాద్ జనసేన

హుస్నాబాద్, ప్రముఖ జర్నలిస్టు, ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టును ఖండిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో అఖిలపక్షం ఏర్పాటు చేసినటువంటి నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ పాల్గొని మద్దతు తెలపడం జరిగింది. నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నని బేషరతుగా విడుదల చేయాలని లేకుంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మల్లెల సంతోష్ మోరె శ్రీకాంత్, గుండా సాయి చంద్, మ్యాకల రాజు తదితరులు పాల్గొన్నారు.