ఇఫ్తార్ విందులో పాల్గొన్న హుజూర్ నగర్ జనసేన

హుజూర్ నగర్ జనసేన పార్ట్య్ నియోజకవర్గ నాయకులు సైదులు యాదవ్, హాసన్ మియాల అధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మతాల సామరస్య కోరుకునే వ్యక్తి అని, ఆయన స్పూర్తితో సోమవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని పవన్ కళ్యాణ్ కి ముస్లిం సోదరుల అండదండలు మరియు అల్లా ఆశీస్సులు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 200 పైగా ముస్లిం సోదరులు, జనసేన నాయకులు అల్లా ఉద్దీన్, సమీర్, ముస్తఫా, నాగరాజు, సత్యనారాయణ, బ్రహ్మము, ఆదిత్య, రాజేష్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.