హుజూర్నగర్ జనసేన ఆత్మీయ సమావేశం

తెలంగాణ, హుజూర్నగర్ నియోజకవర్గం, మేళ్లచెరువు మండల పరిధిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో హుజూర్నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో హుజూర్నగర్ నియోజవర్గం కూడా పోటీలో ఉంటుందని, జనసైనికులు అందరూ ఇప్పటినుండే ఎన్నికలలో నిమగ్నం అవ్వాలని గ్రామస్థాయిలో తిరుగుతూ ఉన్న పార్టీ యొక్క ఓటు బ్యాంకు ను పెంచాలని కార్యకర్తలకు తెలియ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేళ్లచెరువు మండలం నాయకులు సురేష్, మహేష్, భార్గవ్, శ్రీకాంత్, సిద్దు, పవన్, రాంబాబు మరియు జన సైనికులు పాల్గొన్నారు.