Pithapuram: శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో రాజులమ్మను పరీక్షించిన హైదరాబాద్ డాక్టర్

తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి కాలు లావు(బోదకాలు) అయ్యి తీవ్రమైన ఇబ్బంది పడుతుందని చిత్రాడ జనసైనికులు జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి దృష్టికి తీసుకెళ్లారు. ఇంచార్జ్ వెంటనే స్పందించి చిత్రాడ గ్రామం, రాజులమ్మ నివాసానికి వెళ్లి చూసి ఆమె పరిస్థితికి చాలా బాధ పడి, ఆమెకు ఎలాగైనా మన తోచిన సాయం చేయాలని వారి భర్త డాక్టరు శ్రీ మాకినీడి వీరప్రసాద్ కు వివరించగా ఆయన కొంతమంది డాక్టర్స్ తో సమాలోచనలు జరిపిన పిమ్మట రాజులమ్మ కాలు ట్రీట్మెంట్ లో భాగంగా డాక్టర్ శ్రీ మాకినీడి వీర ప్రసాద్ ఫ్రెండ్ అయినటువంటి ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీ డి.వి. కృష్ణారావు ను హైదరాబాద్ నుంచి కాకినాడకి రప్పంచి, ప్రత్యేకంగా పరీక్షలు చేయించడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ విషయంలో రాజులమ్మకు అండగా ఉంటామని డాక్టర్ శ్రీ వీరప్రసాద్, డాక్టర్ శ్రీ కృష్ణరావు తెలియజేసారు.