‘10 ఏళ్ల వరకు నేనే సీఎం’ కేసీఆర్ సంచలన ప్రకటన..

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఏప్రిల్‌లో 6 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఏ జిల్లా వాళ్ళు ముందుకు వస్తే అక్కడే సభ నిర్వహిద్దామని సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతి ఎమ్మెల్యే 50 వేలమందితో సభ్యత్వం నమోదు చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో కేటీఆర్ సీఎం అవుతారన్న ఊహాగానాలకు కేసీఆర్ తెర దించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. 10 ఏళ్ల సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. కేటీఆర్ సీఎం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని.. గీత దాటి మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని నాయకులను హెచ్చరించారు. మరోవైపు ఖమ్మం,వరంగల్, నల్గొండ గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని కన్ఫామ్ చేశారు ముఖ్యమంత్రి.