జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో ఇబ్రహీంపట్నం జనసేన
మైలవరం, జనసేన పార్టీ నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే డిజిటల్ క్యాంపైనింగ్ కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు గ్రామం నుంచి దొనబండ వరకు ఉన్న రహదారి వర్షం కారణంగా ఏర్పడిన గుంతలను కుంగిపోయిన రోడ్డును వెంటనే మరమ్మత్తులు చెయ్యాలని అలాగే కేతనకొండ నుంచి కుటుకులపూడి వరకు చిలుకూరు నుంచి దొనబండ వరకు ఉన్న రహదారుల పక్కన విధి దీపాలు ఏర్పాటు చేయాలని, వర్షాకాల సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యకు వెంటనే పరిష్కార మార్గం చూపించాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీమతి లక్ష్మీ కుమారి, ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పోలిశెట్టి తేజ, జనసేన పార్టీ నాయకులు, సుజాత, కొమ్మూరు వెంకటస్వామి, తిరుమలశెట్టి పవన్, అశోక్, ముత్యాల సతీష్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-16-at-3.13.28-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-16-at-3.13.27-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-16-at-3.13.28-PM-1-1024x576.jpeg)