నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన ఇచ్చాపురం జనసేన

ఇచ్ఛాపురం, కొద్ది రోజుల క్రితం కుసుంపురం గ్రామానికి చెందిన గౌరంగోబిసాయికి 25 గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందాయి. ఆయన నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఈ విషయం తెలిసికొని ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయ కర్త దాసరి రాజు మరియు కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి అంగ శశిరేఖ(సురేష్) చేతుల మీదుగా 10,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఇలాంటి దాడులు చాలా జరుగుతున్నా వాటికి ఎటువంటి ఇన్సూరెన్స్ ప్రభుత్వం కల్పించటం లేదు. దీనిపై త్వరలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచిలి జెడ్పీటీసీ అభ్యర్థి ఈశ్వరరావు జనసేన నాయకులు బార్ల ప్రదీప్ మన్మధ, భాస్కర్ రావు, దివాకర్ చలపతి, సిసింద్రీ, శివ సాయి నవీన్, దేవరాజ్, ప్రదీప్, ఉదయ్ జనసైనికులు పాల్గొన్నారు.