ముంపు ప్రాంతాలను సందర్శించిన ఇచ్చాపురం జనసేన నాయకులు

ఇచ్ఛాపురం మండలంలో ముంపు ప్రాంతాలను సందర్శించిన ఇచ్ఛాపురం జనసేన పార్టీ దాసరి రాజు మరియు జనసేన నాయకులు. ఇచ్ఛాపురంలో జనసేన నాయకులతో కలిసి ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు పలు గ్రామాల్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తులసిగాం పంచాయితీలో బలరాంపురం, లండపుట్టుగ, ఇన్నేసుపేట, తులసిగాం గ్రామాల్లో సుమారు 72 ఇల్లు స్థలాలు జగనన్న కాలనీ కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. పద్మాపురం గడ్డ (దొండిగడ్డ) నుండి వచ్చే నీరు వర్షాలకు నిత్యం ఈ కాలనీలోకి వస్తుంది. ఇక్కడ నిరుపేద కుటుంబాలకు ఇల్లు స్థలాలు ఇచ్చారు ఇక్కడ ఎలా ఇల్లు కట్టుకుంటారు, ఎలా నివసిస్తారు అని దాసరి రాజు ప్రశ్నించారు. ఈ గడ్డకు ఆనించుకొని వందల ఎకరాలు పంట పొలాలు ఉన్నాయి వరదలకు పంట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపైన తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి దీని చుట్టూ వాలును (రక్షణ గోడ) నియమించాలి. అలాగే ఈ స్థలంపైన మట్టి కూడ వేసి ఎత్తు చేసి ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం చూపాలని జనసేనపార్టీ తరుపున కోరుతున్నామని అన్నారు. గ్రామాలను సందర్శించిన వారిలో ఇన్నేసుపేట జనసేన యూత్ లీడర్ దుంగు భాస్కర్ రెడ్డి, నగేష్, దుంగు కుమార్, ఇసురు వెంకటేష్, దుంగు ఢిల్లీ, ఇసురు ప్రసాద్, దుంగు రమేష్, ఇసురు రాజు, దుంగు తారకేష్ తదితరులు పాల్గొన్నారు.