ఇచ్చాపురం జనసేన ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరం

ఇచ్ఛాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కవిటి మండలంలోని నెలవంక గ్రామంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి ఆధ్వర్యంలో నెలవంక గ్రామ పెద్దలు మరియు జనసేన యూత్ సభ్యులు జ్ఞానేశ్వర్, శేఖర్ సహకారంతో జేమ్స్ హాస్పిటల్ (శ్రీకాకుళం రాగోలు) వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు చేతుల మీదుగా జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా మరియు గ్రామస్తులు సమక్షంలో ప్రారంభించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పుల సమస్యలు మరియు అన్ని రకాల సాధారణ వ్యాధులకు అనుభవజ్ఞులైన వైద్య బృందంతో పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపుకి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది. దాదాపుగా 147 మందికి పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 9, 10వ వార్డు ఇంఛార్జిలు సంతోష్ మహారాణ, రోకళ్ళ భాస్కర్, కంచిలి ఎంపీటీసీ అభ్యర్థి సుశీల, వీరమహిళ శైలజ, దుంగు భాస్కర్, దుగాన దివాకర్, హేమచలపతి, ఢిల్లీ, మధు, వెంకటేష్, మురళి, జానకి రావు లోకేష్, వల్లభ, మహేష్, ప్రవీణ్, కుమార్, ఢిల్లీరావు, చందు, సాయి, మాధవ్, శ్యామ్ మురళీ, రాజు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.