ఇచ్చాపురం జనసేన ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరం

ఇచ్చాపురం: జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు కవిటి మండలంలోని మెలియాపుట్టుగ, డొంకపుట్టుగ గ్రామంలో జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇచ్చాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు చేతుల మీదగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బైపల్లి ఈశ్వరరావు మరియు కంచిలి జడ్పీటీసీ అభ్యర్థి శారదాఈశ్వరరావు, ఐటీ వింగ్ కో ఆర్డినేటర్ కాళ్ళ దాలయ్య, జనసేన నాయకులు మన్మధ రావు, లోళ్ళ రాజేష్, ఇచ్చాపురం మున్సిపాలిటీ 10వ వార్డ్ ఇంచార్జ్ రోకళ్ళ భాస్కర్, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి సురేష్, రాజశేఖర్, బడే రాజు, శివ బెహారా, మోహన్, గ్రామస్తులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంనందు కిడ్నీ సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు, కీళ్ల నొప్పులు మరియు అన్ని సాధారణ వ్యాధులకు అనుభవజ్ఞులైన వైద్య బృందంతో పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారుగా 300 మందికి పైగా పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. మారుమూల ప్రాంతమైన మెలియాపుట్టుగ గ్రామంలో ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులకు, జనసేన పార్టీ నాయకులకు ఆ ఊరు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెలియాపుట్టుగ జనసైనికులు శ్రీను, శంకర్, మోహన్, కోదండ, ఆనంద్, వాసు, ధనుంజయ, బొనమాలి, కఘుపతి, హరీష్, గౌతమ్, తిరుపతి, రాము, భాస్కర్, దివాకర్, ఈశ్వర్ రావు తలగాన, జైకృష్ణ, చుడామణి తదితర జనసైనికులు పాల్గొన్నారు.