కిడ్నీ వ్యాధితో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి ఇచ్ఛాపురం జనసేన ఆర్థికసాయం

ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలం దుగాన పుట్టుగ పంచాయతి మున్ని పుట్టుగ గ్రామానికి చెందిన పెట్ట ఈశ్వర్ వయస్సు 45 సంవత్సరాలు గత కొద్దికాలంగా కిడ్నీ వ్యాధి బారిన పడి, గత నెలలో అకాల మరణం చెందడం జరిగింది. ఈయన మరణ వార్త విని కలత చెంది ఆ గ్రామ జనసైనికులు అభిరామ్, చందు, ప్రకాష్, ధర్మరాజులు పెద్ద దిక్కు కోల్పోయిన ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని ముందుకు వచ్చి, నియోజక వర్గ జనసైనికుల తోడ్పాటుతో ఆర్థిక సహాయం చేయాలని, అందులో భాగంగా శుక్రవారం ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త దాసరి రాజు చేతుల మీదుగా ఆ కుటుంబానికి 10,000 రూపాయలు అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 10వ వార్డు ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్ మరియు నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్న ఈ నిరుపేద కుటుంబాన్ని స్వచ్ఛంద సంస్థలు మరియు దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని దాసరి రాజు కోరారు.