గిరిజనులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: చిర్రి బాలరాజు

పోలవరం నియోజకవర్గం: జీలుగుమిల్లి మండలం, తాటి రామన్నగూడెం గ్రామంలో గత 40 సంవత్సరాలుగా సాగు ఉన్నటువంటి గిరిజనుల యొక్క భూమిని అధికార వైసీపీ పార్టీకి సంబంధించిన వారు, వారి యొక్క అధికార బలంతో వాటిని స్వాధీనపరచుకోవాలని ప్రయత్నించగా గిరిజనులు అడ్డు పడ్డారు, వారిని ప్రశ్నించగా అధికార బలంతో వారిని పోలీసులతో భయబ్రాంతులకు గురి చేసారు. ఈ విషయంపై సోమవారం తాహసిల్దార్ ఆఫీస్ వద్ద గ్రామస్తులందరూ కలిసి ధర్నా నిర్వహించారు. వారికి మద్దతుగా జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు అండగా నిలిచారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదు, వారి భూములు వారికి ఇచ్చేంతవరకు వారి పక్షాన నిలబడతామని గిరిజనులకు హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మార్వో గారితో త్వరితన పరిష్కరించాలని లేని పక్షాన ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియపరిచారు.