తాడేపల్లి ప్యాలస్ జగనన్న కాలనీలో కట్టుకుంటే కనీసం ప్రజలు పడే బాధలు అర్దమయ్యేవి – పాశం నాగబాబు

నూజివీడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న మోసం అనే కార్యక్రమాన్ని రెండవ రోజు నియోజకవర్గంలోని ముసునూరు మండలంలోని చెక్కపాల్లి, వలసపల్లి గ్రామాల్లో ప్రభుత్వం అందజేసిన జగనన్న ఇళ్ల స్థలాలను జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ళ స్థలాల పేరుతో వైసీపీ స్టానిక నాయకులు ఊరికి దూరంగా చెరువు గుంతలను దేనికి పనికి రాని విలువ కూడా లేని భూములను లక్షలకు విలువ కట్టి జేబులు నింపుకునే పెద్ద స్కాంలు జరిగాయని, ప్రభుత్వం లక్షలాది ఇళ్లను మంజూరు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న నేటికీ చాలా ఊర్లలో ఇప్పటివరకు దాదాపు 50 శాతం ఇళ్ల స్థలాలు కూడా కేటాయించలేదు అని ఇంకా నిర్మాణ పనులు ఎప్పుడు చేపట్టేది ఎప్పుడు పూర్తిచేసేది? మాటలు చెబుతూ పేదలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్నట్టు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ యొక్క ఇళ్ల స్థలాలను పర్యటించి వీరందరికీ న్యాయం జరిగేలా జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, ముసునూరు మండల వైస్ ప్రెసిడెంట్ బోట్ల నాగేంద్ర, నాయకులు తోట ప్రేమ్, కమ్ముకురి సురేష్, బజారు శేషు, మనురాజు పవన్, చేకూరి సాయి, సూర్య, బయం సతీష్, ఉప్పె చందు, వంశీ, వేట త్రినాథ్, కేశవ జనసైనికులు పాల్గొన్నారు.