అన్నం పెట్టే రైతు చనిపోతుంటే జగన్ మాట తప్పాడు

  • కౌలు రైతు బరోసా ఎవరికి ఇచ్చారు! అన్నం పెట్టే రైతు చనిపోతుంటే జగన్ మాట తప్పాడు – రైతుల ఆవేదన!!
  • ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర – 53వ రోజు
  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం 53వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య ఆధ్వర్యంలో ముచ్చుఓలు పంచాయతీలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. ముందుగా క్రేన్ ద్వారా బారీ గజమాలతో, పూల వర్షంతో, బాణాసంచాతో స్వాగతం పలికిన ప్రజలు. పంచాయతీలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామంలో కౌలు రైతులు చితికి పోతున్నారు, చనిపోయిన కౌలు రైతుకు ఎలాంటి సహకారం అందలేదని రైతులు తెలిపారు, పండించిన పంటకు గిట్టబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా ఆదుకుంటామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, నాయకులు కవిత, వెంకట సుబ్బయ్య, భరత్ కుమార్, పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, తొట్టంబేడు మండల అధ్యక్షులు పేట చంద్ర శేఖర్, పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.