సమస్య ఎక్కడ ఉంటే – జనసేన అక్కడ ఉంటుంది
రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం చెన్నడం గ్రామంలో వారం రోజుల నుంచి కులాయిల సమస్య వల్ల ప్రజలకు త్రాగు నీరు లేక అల్లాడిపోతున్నారు. చుట్టుపక్క నీరంతా ఉప్పునీరు ఆపై వేసవికాలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో అక్కడి జనసేన నాయకులు బడుగు శీను బాబు ఈ సమస్యను రాజోలు మండల అధ్యక్షులు జనసేన సూరిశెట్టి శ్రీను దృష్టికి తీసుకురావడంతో ఆయన సొంత ఖర్చుతో చెన్నడం గ్రామ ప్రజలకి వాటర్ ట్యాంకర్ పంపించడం జరిగింది. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగినా జనసేన అండగా నిలబడుతుందని తెలియజేయడంతో గ్రామ ప్రజలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు, జనసేన పార్టీ కి, జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-21-at-6.23.05-PM-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-21-at-6.23.06-PM-1024x769.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/vlcsnap-2022-04-21-18h37m50s797.png)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/vlcsnap-2022-04-21-18h38m00s241.png)