15 రోజుల్లో గడ్డర్లు తొలగించకపోతే దీక్ష చేస్తాం – పోలిరెడ్డి

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం తాళ్లపాలెం గ్రామంలో ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో ఇంటీంటికి మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తాళ్లపాలెం గ్రామంలో ప్రజలు, రైతులు ముఖ్యంగా గత కొన్ని నెలల నుండి ఎదుర్కొంటున్న రైల్వే అండర్ పాస్ వంతెన సమస్య మీద నిడదవోలు జనసేన పార్టీ, తెలుగుదేశం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ చాలా నెలల నుండి రైల్వే పనులు పూర్తి అయినా కానీ రాకపోకలు సాగించడానికి వీలులేకుండా గడ్డర్లు బిగించారు అని చాలా సార్లు ఎమ్మెల్యే గారికి విన్నమించిన పట్టించుకోవట్లేదని తెలిపారు.ఈ గడ్డర్లను 15 రోజుల్లో గడ్డర్లు తొలగించకపోతే నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలిరెడ్డి వెంకటరత్నం (పీవీఆర్),ఉమ్మడి జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ సభ్యులు పాలా వీరాస్వామి, పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, గ్రామ సర్పంచ్ యర్రా రామకృష్ణ, గంధం సీతయ్య నాయుడు, జగత ఏడుకొండలు,గ్రామ అధ్యక్షులు సింగులూరి సతీష్, పాలకోడేటి గోపినాధ్,మరియు గ్రామ తెలుగుదేశం, జనసేన నాయకులు, జనసైనికులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.