దమ్ముంటే మా జనసేనానిని నిజాయితీగా ఎదుర్కోండి: తాతంశెట్టి నాగేంద్ర

రైల్వే కోడూరు నియోజకవర్గం: జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర ఆధ్వర్యంలో అధికార పార్టీ చేస్తున్నటువంటి కక్షపార్టు చర్యలను తీవ్రంగా ఖండిస్తూ రైల్వే కోడూరు లోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ.. మా నాయకుడు మాకు నేర్పిన క్రమశిక్షణతో మీలాంటి దిగజారుడు రాజకీయాలు జనసేన పార్టీ ఏనాడూ చేయదని, దమ్ముంటే మీరు మా నాయకుడిని నిజాయితీగా ఎదుర్కోవాలని మా నాయకుడిని నిజాయితీగా ఎదురుకోలేక మీరు ఇటువంటి అవకతవక పనులు పాల్పడుతున్నారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతీయ కమిటీ రీజినల్ కో ఆర్డినేటర్ కుప్పాల జ్యోతి మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి 2024లో ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెప్తారని, ఈ రాక్షస పాలన వలన ప్రజలు విసుగెత్తి ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వైయస్సార్సీపీకి త్వరలోనే వినాశనం తప్పదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పగడాల వెంకటేష్, ముత్యాల కిషోర్ కుమార్, రామసుబ్బయ్య, శ్రీకారం ప్రకాష్, జోగినేని మనీ, వరి కోటి నాగరాజు, బీదం నవీన్, వీరేంద్ర, కుక్కంటి మహేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.