నువ్వు సిద్ధం అంటే నీకు యుద్ధమే

నెల్లిమర్ల, జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా శ్రీమతి లోకం మాధవిని ప్రకటించిగా ఆదివారం నెల్లిమర్లలో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి నెల్లిమర్ల నలుమూలల నుండి పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు జనసైనికులు, మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి లోకం మాధవి మాట్లాడుతూ ఇది మనం చేసుకున్న అదృష్టమని పవన్ కళ్యాణ్ నోటివెంట మొదటి పేరు నెల్లిమర్ల నియోజకవర్గం రావడం ఇప్పటివరకు మనం చేసిన కష్టం యొక్క ఫలితమే అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ జగనాసురుడిని, వైకాపా ప్రభుత్వాన్ని దింపే విధంగా అందరూ కృషి చేయాలని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో చేయవలసిన కార్యాచరణ, తెలుగుదేశం పార్టీ నేతలతో, కార్యకర్తలతో, ఎలా ముందుకు సాగాలి అనేదానిపై నాయకులకు జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఈ రెండు నెలలు అహర్నిశలు శ్రమించి పార్టీ యొక్క గాజు గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లి చెప్పాలని వివరించారు. మన ప్రభుత్వం రావడం ద్వారా మన ప్రాంత సమస్యలు తీరుతాయని, లేని ఎడరా తన సొంత ఖర్చుతోనైనా ప్రాంతాభివృద్ధికి తోడ్పడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.