సంపత్ నాయక్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన ఇల్లందు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జ్
తెలంగాణ, హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో తెలిపారు. ఉస్మానియా ఉద్యమకారుడు, వైరా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ మరియు జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నానని, గతంలో సంపత్ నాయక్ తో అనేక ఉద్యమాలలో పాల్గొని యావత్ గిరిజన సమస్యలపైనే కాకుండా ప్రజా సమస్యలపైన కూడా పోరాడిన నేను నేటి నుంచి జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీని ప్రజలు ఇంకా ముందుకు తీసుకెళ్తానని అదేవిధంగా వైరాలో సంపత్ నాయక్ ని గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నానని అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-09-at-11.26.59-522x1024.jpeg)