Agiripalli: జనసేన శ్రేణులపై అక్రమ కేసులు
సెప్టెంబర్ 14 వ తేదీన ఆగిరిపల్లి బస్టాండ్ దగ్గర రోడ్లు బాగు చేయాలని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నూజివీడు జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు మరీదు శివరామకృష్ణ ఆధ్వర్యంలో బస్టాండు సమీపంలో ఫ్లెక్సీ కట్టడం జరిగింది. అధికార పార్టీ నాయకులు ఒత్తిడి మేరకు ఆగిరిపల్లి పంచాయతీ సెక్రటరీచే ఈరోజు కేస్ పెట్టడం జరిగింది. అధికారపార్టీ సమస్యలపై మాట్లాడుతున్న వారిని, సమస్యలు ఎత్తిచూపుతున్న జనసేనపార్టీని ఎలాగైనా ఇబ్బందులకు గురిచేయాలని కక్ష సాధింపులో భాగంగా ఇలాంటి అక్రమ చర్యలు తీసుకుంటున్నారని భావిస్తున్నామని, అయినా జనసేన పార్టీ సమస్యలపై పోరాడటం అపదు, అదరదు, బెదరదని జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్ న్యాయవాది శ్రీ బత్తిన హరిరామ్ అండగా ఉండి స్టేషన్ ఫార్మాలిటిస్ ముగించడమైనది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-27-at-10.28.49-PM-1024x1024.jpeg)