పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మెకు ఇమ్మడి కాశీనాధ్ సంఘీభావం

  • మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకి మరియు ఇంజనీరింగ్ వర్కర్స్కి సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు గత 14 రోజుల నుండి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు మరియు ఇంజనీరింగ్ వర్కర్స్ తమ యొక్క డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన ధర్నాకి సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు మరియు ఇంజనీరింగ్ వర్కర్స్ యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కో-ఆర్డినేటర్ వీరిశెట్టి శ్రీనివాసులు, మార్కాపురం పట్టణ నాయకులు పిన్నేబోయిన శ్రీనివాసులు, విజయరావు నరసింహ, బొందిలి కాశీరామ్ సింగ్, పిచ్చయ్య, ఫణి, గుంటు మోషే మరియ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.