వైసిపి ప్రభుత్వం వారు ప్రతిపక్షాల గొంతు నొక్కేయటం ఎన్నాళ్లో మేము చూస్తాం: గాదె

వేమూరు నియోజవర్గం, చుండూరు మండలం, మోదుకూరు గ్రామంలో దేవి నవరాత్రుల్లో సందర్భంగా ప్రభలు ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తూ ఉన్న సందర్భంలో అధికార పార్టీ నాయకులు ఓర్వలేక మాపై ఏదో ఒక వంకతో పోలీసులు చేత మాపై ఒత్తిడి తీసుకురావటం ప్రతి విషయంలో ఏదో ఒక ఆటంకం కలిగించటం జనసేన పార్టీ వారు తిరణాళ్ళలో పాల్గొనకూడదని, మేము ముందే పోలీస్ వారి నుంచి అన్ని పర్మిషన్స్ తీసుకున్నా మాపై ఏదో ఒక రకమైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. పోలీస్ వారు నిన్నటి నుంచి ఉదయాన్నే మమ్మల్ని స్టేషనుకి పిలిపించటం సాయంత్రం వరకు కూర్చోబెట్టటం. అలానే మంగళవారం కూడా ఉదయాన్నే పిలిపించటం జరిగింది. ఈ విషయాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె.వెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి తెలుపగా వారు పోలీస్ స్టేషన్ కి వచ్చి సిఐతో, డిఎస్పితో మాట్లాడి అందరిని బయటికి తీసుకువచ్చి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.