నడుకూరులో వైస్సార్సీపీ నుండి జనసేన పార్టీలో భారీగా చేరికలు

పాలకొండ నియోజకవర్గం: నడుకూరు గ్రామం జనసేన పార్టీ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్, నియోజకవర్గ నాయకుడు మత్స పుండరీకం ఆధ్వర్యంలో మాజీ బి ఎస్ ఎఫ్ జవాన్ మత్స వెంకట రమణ అధ్యక్షతన పాలకొండ నియోజక వర్గం జనసేన పార్టీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కండువాలు వేసి నడుకూరు పంచాయతీ బోర్డు వైస్ ప్రెసిడెంట్ బత్తుల సాయి కుమారి, 1.యజల పోలీస్, 6వవార్డ్ మంతిని ఫకీరు నాయుడు, 7వ వార్డ్ తూముల ధనుంజయ నాయుడు, 8వ వార్డ్ మత్స జయలక్ష్మి, 9వ వార్డ్ బౌరొతు లక్ష్మీ, 10 వ వార్డ్ మజ్జి ముసలి నాయుడు వార్డ్ మెంబెర్స్ , మాజీ వార్డ్ మెంబెర్స్ మత్స. లక్ష్మీ, సాధు కసియ్య, మాజీ వైస్ ప్రెసిడెంట్ బత్తుల అప్పల నాయుడు, బత్తుల భాస్కర రావు, లెంక రవికుమార్, యర్రపాత్రుని శ్రీనివాసరావు, బత్తుల భుజింగా రావు, మరియ వైస్సార్సీపీ నుండి 100 కుటుంబాలు మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలోకి ఆహ్వానిచారు. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యిందని ఈ ఎన్నికల్లో పాలకొండ లో జనసేన పార్టీ గెలుస్తుందని, రాష్ట్రంలో జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జనసేన జాని, జనసేన పార్టీ వీరఘట్టం టౌన్ అధ్యక్షుడు సరిపల్లి అచ్చుత్, కర్ణేన సాయి పవన్, నందివాడ పండు, మెడిద సందీప్, ఉదయాన చరణ్, దత్తి సంతోష్, బొత్స కార్తీక్, చుక్క భార్గవ, సూపర్ టైలర్, ఉదయాన శ్యామ్, తెలుగుదేశం నాయకులు వెలగడ శ్రీనివాసరావు, ఉదయాన ఉదయ్, కృష్ణ మూర్తి నాయుడు, ముంజేటి అప్పల నాయుడు, తదితరులు పాల్గొన్నారు.