రామాపురంలో.. గిరిసేన – జనసేన

*పార్వతీపురం మన్యం జిల్లా , పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, రామాపురం గిరిజన గ్రామంలో పర్యటించిన మత్స పుండరీకం

*గిరిసేన – జనసేన కార్యక్రమంలో ప్రతిజ్ఞ పునిన గిరిజన యువత

గిరిసేన – జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ మత్స పుండరీకం మాట్లాడుతూ.. ఉన్నతమైన వ్యక్తులు తోనే వ్యవస్థలో ఉన్నతమైన, ఉత్తమమైన మార్పులు వస్తాయి. ఆ ఉన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ ఉన్నత మైన, ఉత్తమ మైన వ్యవస్థ ఏర్పాటు చేసేది జనసన పార్టీ అని ఉద్భోదించారు. మన జనసేన పరివారం ఎంత పెద్దదైతే అంత గొప్ప విజయాలు జనసేన పార్టీ సొంతం అవుతాయని తెలియజేసారు. గుండె ధైర్యం అంటే జిమ్ కి వెళ్తే వచ్చేది కాదు.. సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి ఆ సమస్య పరిష్కరిస్తే వచ్చే ఆనందంమే తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఓట్లు, నోట్లు, అధికార వ్యామోహంతో రాజకీయాల్లోకి రాలేదు, యువశక్తిని రాజకీయశక్తిగా మార్చడానికి వచ్చారని తెలియజేసారు. సమాజంలో మార్పు రావాలంటే తుపాకులు, కత్తులు పట్టుకొని యుద్ధం చేయటం కాదు. ప్రతి ఒక్కరు ధైర్యంగా నిలబడి అభిప్రాయం చెప్పాలని ఉద్ఘాటించారు. రాజకీయాల్లో మార్పు తీసుకు రావాలంటే బలమైన సంకల్ప బలం ఉండాలని తెలిపారు. రాజకీయాల్లో రాణించాలంటే నాయకులకు కార్యకర్తలకు ఓపిక సహనం చాలా అవసరమని, అవమానాలకు ఎదురొడ్డి నిలబడాలని తెలిపారు. కులం పేరు చెప్పి వ్యక్తులు లాభపడ్డారు తప్ప. కులాలు బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రమేనని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు బూత్ స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించరు. ఇ నెల లో విశాఖపట్నం వేదిక గా జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం ఉంటుందని పాలకొండ గిరిజన నియోజకవర్గఒ (ఎస్టి) లో ఉన్న గిరిజనులు సమస్యలు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి కి తీసుకువెల్లేఒదుకు మీరు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన యువత మేము జనసేన పార్టీ కి అండగా ఉంటామని, రాబోయే ఎన్నికల్లో మా ప్రాంతంలో ని గిరిజన ప్రజల ఓట్లు జనసేన పార్టీ గాజుగ్లాస్ గుర్తుకి వేసేవిధంగా మార్పు తీసుకువస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బి.పి. నాయుడు, కుంబిరిక ఢిల్లీశ్వర్, బిడిక వినోద్, బిడిక నవనీత్, గుమ్మడి సుధాకర్, వావిలిపల్లి నాగభూషణం, దండేల సతీష్, కర్నేన సాయి పవన్, అన్ను రామకృష్ణ, కంటు మురళి తదితర జనసైనికులు పాల్గొన్నారు.