ఏటిమొగ ప్రాంతంలో నాడెండ్ల మాట కాకినాడలో ప్రతి నోటా

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో మనోహర్ మాట కాకినాడలో ప్రతి నోటా కార్యక్రమం రచ్చా ధనలక్ష్మి ఆధ్వర్యంలో 15వ డివిజన్ ఏటిమొగ ప్రాంతంలో గాంధీ గారి విగ్రహం దగ్గర జరిగింది. ఈ సంధర్భంగా జనసేన శ్రేణులు మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్లగారు మాట కాకినాడలో అందరినోట అనే నినాదంతో ప్రతిరోజూ చైతన్య యాత్రని చేస్తున్నామన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలు అన్నీ రకరకాల అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతూ ఉంటే, అదేంటో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం రివర్స్ గేర్లో పోటీపడుతోందని ప్రజలు ఆందోళన పడుతున్నారన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ఏది పట్టి చూసినా అవినీతే అనీ, ఇంతకు ముందు ప్రజాప్రతినిధులు సైతం విస్తుపోతున్నారనీ ఇంతటి అవినీతిని ఎపుడూ చూడలేదని అంటున్నారంటే అవినీతి ఏస్థాయిలో ఉందో ఒకసారి ఆలోచించాలన్నారు. ఈ అవినీతి అసమర్ధ వై.సి.పి ప్రభుత్వాన్ని పారదోలడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడకూడదన్న ఆలోచనతో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయనీ అందుకు మీ మద్దతు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమాడి రాజు, పాలెపు మణికంఠ, చెక్కా అజయ్ కుమార్, మల్లాడి రాజు తదితరులు పాల్గొన్నారు.