రాజధాని భూముల విషయంలో.. ఏపీ ప్రభుత్వానికి షాక్

హైకోర్టులో ఆంధప్రదేశ్‍ ప్రభుత్వానికి షాక్‍ తగిలింది. ఏపీ రాజధాని భూముల్లో ఇన్‍సైడర్‍ ట్రేడింగ్‍ జరిగిందంటూ సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. కిలారు రాజేష్‍తో పాటు మరికొంత మంది రాజధానిలో భూమలు ముందుగానే కొనుగోలు చేశారని సీఐడీ కేసులు నమోదు చేసింది. రాజధానిలో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసింది. భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ప్రభుత్వం కక్షసాధిస్తోందని పేర్కొంటూ కిలారు రాజేష్‍ హైకోర్టులో క్యాష్‍ పిటిషన్‍ వేశారు. పిటిషనర్‍ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఇన్‍సైడర్‍ ట్రేడింగ్‍ జరగలేదని పేర్కొంటూ.. దీనికి ఐపీసీ సెక్షన్లకు వర్తించవని హైకోర్టు సృష్టం చేసింది.