ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి విజయానికి ప్రణాళికాబద్దంగా పని చేయాలి

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోసం ఆదివారం రాజమండ్రిలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశానికి హాజరై కూటమి అభ్యర్థి విజయానికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలని, సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఉభయ గోదావరి జిల్లాల జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గాల ఇంచార్జిలు, నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment