దక్షిణ నియోజకవర్గంలో జనసేనకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. శుక్రవారం దక్షిణ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ 17 రోజులుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దక్షిణ నియోజకవర్గంలో పలు వార్డులలోని సుమారుగా అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి చోట జనసేనకు ప్రజల బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అధికారులకు రావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. తమ పార్టీకి అలాగే అలాగే తమ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా గర్భిణులకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.