రాబోయే కాలంలో ప్రజలే బుద్ది చెప్తారు: చిర్రి బాలరాజు

పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలంలో మండల అధ్యక్షులు యుగేందర్ మరియు ఆవుల శ్రీను, ముద్దపు వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో జనంలో జనసేన కార్యక్రమం అద్భుతంగా సాగింది. గురువారం చిర్రి బాలరాజు భువనగిరి, బంజరగూడెం, రాయిగూడెం గ్రామాలలో పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు ఇంటింటికి వెళ్లారు. రాయిగూడెం గ్రామంలో వీరమహిళలు హారతి ఇచ్చి పూలమాలలు వేసి, వీర తిలకం దిద్ది ఆహ్వానించారు. ఆయన ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సంభంధిత అధికారులతో మాట్లాడారు. అయన మాట్లాడుతూ మండలంలో ఎక్కడ ఏ ఇంటికి వెళ్లినా నిర్వాసితుల సమస్యలు అలాగే చదువుకున్న వారికి ఉద్యోగాలు తమకు ఉండడానికి ఇల్లు లేవని ప్రజలు వాపోతున్నారు అని ఆయన అన్నారు. మరి ఈ 4ఏళ్ల పాలనలో ప్రభుత్వం నియోజకవర్గంలో ఏమి వృద్ధి సాధించిందో తెలపాలన్నారు. రాబోయే కాలంలో ప్రజలే వీరికి బుద్ది చెప్తారని అయన అన్నారు. ఏదైనా సమస్యలు వస్తే జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది అని, అది ఎలాంటి సమస్యలు అయినా పోరాడటానికి జనసేన సిద్ధంగా ఉంటుంది అని గ్రామస్థులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాడిద వెంకటేశ్వర్లు, మంత్రి గోపి, కుక్కునూరు సీతారామయ్యా, కిరణ్, సుధాకర్, విద్యాసాగర్, ఎస్. నాగు, నాగేంద్రబాబు, కిట్టు, ఎం. దుర్గాప్రసాద్ మరియు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.