తిరుపతి జనసేన ఆద్వర్యంలో చలో మచిలీపట్నం గోడ పత్రికల ఆవిష్కరణ
- 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం..
- 2024లో జనసేన జెండాను ఎగరేద్దాం..
తిరుపతి: పాలక వైసిపి రాష్ట్రాన్ని దోచుకునే క్రమంలో ఇసుక, లిక్కర్, భూ కబ్జాలు, అవినీతి దోపిడీల లెక్కలను బయటపెట్టే దిశగా, ఈనెల 14వ తేదీ జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవంలో మన జనసేనాని బహిరంగ సభలో ప్రసంగిస్తారని, ఈ సభకు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, పెద్ద ఎత్తున విచ్చేసి సభను విజయవంతం చేయాలంటూ, జనసేన పార్టీ తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి పిలుపునిచ్చారు.. శనివారం మీడియా ముందు పట్టణ ఉపాధ్యక్షులు బాబ్జి, చిత్తూరు జిల్లా కార్యదర్శి హేమ కుమార్, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ బాబు, మునుస్వామి, మరియు యువ నాయకులు మనోజ్, సుజిత్, కోమల్, అదికేశవులు, ప్రశాంత్ రెడ్డి తదితరులతో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ ఈ సభకు 14వ తేదీ మంగళవారం ఉదయం 10:00కు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మచిలీపట్నం సభా ప్రాంగణం వరకు పదివేల బైకులతో భారీ ర్యాలీ తలపెట్టినట్లు వెల్లడించారు.. ఈ సభకు చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి జన సైనికులు హాజరుకావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.. ఇది జన సైనికులకు ఓ పండుగ వాతావరణమని కొనియాడారు, రోజురోజుకి రాష్ట్ర ప్రజల్లో పవన్ కళ్యాణ్ పై పెరుగుతున్న ఆదరణ తో 2024లో పవన్ సీఎం కావడం ఖాయమని ఆశా భావం వ్యక్తం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-11-at-6.17.20-PM-1-1024x502.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-11-at-6.17.21-PM-1024x406.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-11-at-6.17.21-PM-1-1024x319.jpeg)