చిత్తూరు జిల్లా వీరమహిళా కార్యాలయ ప్రారంభోత్సవం

రాయలసీమ వీరమహిళా విభాగం డా.వనజ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆదివారం చిత్తూరు జిల్లా వీరమహిళా కార్యాలయ ప్రారంభోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించగా.. తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిని, జయ రెడ్డి, విజయ రెడ్డి, గంగాధర నెల్లూరు జనసేన పార్టీ ఇంచార్జ్ యుగంధర్ పొన్నలు పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వీరమహిళలు, జనసైనికులు, స్టేట్, జిల్లా, పట్టణ కమిటీలు హాజరవడం జరిగింది.