ఘనంగా జనసేన జెండాస్థూపం ఆవిష్కరణ

  • జనసేన పార్టీలో చేరిన వైసీపీ నాయకులు

అమలాపురం నియోజకవర్గం, సాకుర్రు గున్నేపల్లి గ్రామంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ డిఎంఆర్ శేఖర్ ముఖ్యఅతిథిగా జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం వైసీపీకి చెందిన సుమారు 60 మంది నాయకులు అధికార ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు తాము విసుగుచెంది జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్టు తెలియజేశారు వారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎంఆర్ శేఖర్ వారికి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ అమలాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరినీ కలుపుకొని రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి ప్రభుత్వం స్థాపించే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అమలాపురం రూరల్ మండలం అధ్యక్షులు లింగోలు పండు,అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, ఉప్పలగుప్తం మండల అద్యక్షులు ఆకుల సూర్యనారాయణ మూర్తి అల్లవరం మండల నాయకులు పోలిశెట్టి బాబులు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బట్టు పండు, కొప్పుల నాగ మానస, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, వాకపల్లి వెంకటేశ్వరరావు, చెట్ల మంగతాయారు,తిక్క సరస్వతి, కొరుమిల్లి రాంబాబు, నాగాబత్తుల వెంకటేశ్వరరావు, ఆర్.డి.ఎస్ ప్రసాద్, నల్లా వెంకటేశ్వరరావు, అల్లాడ రవి, గంధం శ్రీనివాస్, పోలిశెట్టి దుర్గా ప్రసాద్, కరిముళ్ల బాబా, కంకిపాటి గోపి, పోలిశెట్టి కన్నా, సత్తి చిన్న, గంగాబత్తుల కిషోర్, నూకల రాజా, నిమ్మకాయల సాయి, మోటూరి సూర్య కిరణ్, గట్టేం వీరు, పోలిశెట్టి పవన్ మహేష్, నల్లా దుర్గారావు, నల్లా బ్రహ్మాజీ మరియు సాకుర్రు గ్రామ పెద్దలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.