జనసేన నూతన కార్యాలయ ప్రారంభోత్సవం

ఉదయగిరి నియోజకవర్గం: సీతారామ పురం మండలం జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు మరియు ఉదయగిరి జనసేన నాయకులు జనసేన సైనికులు పాల్గొన్నారు. నెల్లూరు సిటీ తర్వాత అత్యధికంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన నియోజకవర్గం. దాదాపు 20 సంవత్సరాలుగా ఒకే కుటుంబ పాలన వలన పూర్తిగా వెనకకు నెట్టివేయబడిన ప్రాంతం. ఉద్యోగ అవకాశాలు లేక యువత దూర ప్రాంతాలకు వలసలు ఎక్కువ. పొలాలకు గాని త్రాగేందుకు కానీ నీరు అందించలేని దుస్థితి. తెల్లరాయి, నల్ల మట్టి, ఎర్రచందనం సంపద అంతా దోపిడీకి గురవుతుంది. రైలు మార్గంలేని నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం, వైద్య సేవలు కూడా ఇక్కడ అంతంత మాత్రమే. ఇక రోడ్లు పరిస్థితి దారుణం. ఖచ్చితంగా ఈ కుటుంబ పరిపాలన అంతమొందించాలి. నియోజకవర్గ అభివృద్ధి సాధించాలంటే ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి జనసేన ప్రభుత్వం స్థాపించడానికి అందరూ కలిసి పోరాడడానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.