తగరపు శ్రీనివాస్ అధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ

హుస్నాబాద్ నియోజకవర్గం: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను పురస్కరించుకొని హుస్నాబాద్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, తోటి జనసేన నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల అధ్యక్షుడు మల్లెల సంతోష్, ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి వినోద్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వొద్దమల్ల‌‌‌ విజయ్, తోడేటి సంపత్, సెక్రెటరీ తగరపు సందీప్, సోషల్ మీడియా సెక్రెటరీ రెడ్డి గోపినాథ్, పట్టణ నాయకులు మోరె శ్రీకాంత్, నేవూరి పవన్, కొంకటి లింగమూర్తి, బోనగిరి రఘువరన్, బత్తుల జగదీష్, కొంకటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.