పెద ఇర్లపాడులో నూతన జనసేన కార్యలయ ప్రారంభోత్సవం
కనిగిరి నియోజకవర్గం: పిసిపల్లి మండలం, పెద ఇర్లపాడు గ్రామంలో బుధవారం సాయంత్రము జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు మాదాస్ రమేష్ ఆధ్వర్యంలో పెద ఇర్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ, నూతన పార్టీ కార్యలయం ప్రారంభం మరియు వీధిలైట్ల స్విచ్ ఆన్ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు కనిగిరి నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి నాగరాజు మరియు టీడీపీ కనిగిరి నియోజకవర్గ ఇంచార్జి ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాయపాటి అరుణ, జిల్లా కార్యదర్శి రహిమల్లా మరియు టిడిపి పి.సి. పల్లి మండల అధ్యక్షులు వేమూరి రామయ్య విచ్చేస్తున్నారు. జనసేన మరియు టీడీపి పార్టీల కనిగిరి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనవలసిందిగా కోరుచున్నామని జనసేన పార్టీ పి.సి.పల్లి మండల అధ్యక్షులు బండారు రాజు మరియు పి.సి.పల్లి మండల జనసైనికులు మరియు పెద ఇర్లపాడు జనసైనికులు తెలియజేయడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-06-at-6.34.06-PM-1024x819.jpeg)