నూజివీడు జనసేన కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

నూజివీడు టౌన్: నూజివీడు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి. కిషోర్ మరియు నూజివీడు నియోజకవర్గ వీరమహిళ రామిశెట్టి తేజస్విని సంయుక్తంగా వేయించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పార్టీ 4 మండలాలూ కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొని అట్టహాసంగా విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి నూజివీడు నియోజకవర్గ ఫైర్ బ్రాండ్ మరీదు శివరామకృష్ణ గారు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గమంలో ఏక్కడ ఏ సమస్యా ఉన్న జనసేన పార్టీ తరుపున ఎటువంటి పోరాటాలు చెయ్యడానికి అయిన నేను సిద్ధం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపై పోరాటానికి తాను సిద్ధం అని అన్నారు. గ్రామాలు, మండలాలలో ఏ సమస్యలు ఉన్నా నాకు చెప్పండి ప్రభుత్వ మెడలు వంచి సమస్యలు పరిష్కారంకు ముందు ఉంటాను అని, తను షో చేసే నాయకుడిని కాదు అని సమస్యలు అంటే పారిపోయే రకం కాదు అన్నారు. ఆ తర్వాత అందరి సమక్షంలో పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాము, మండల కార్యదర్శిలు చేరుకుపల్లి కిషోర్, షేక్. నాగూర్, టౌన్ నాయకులు బండారు రాజు, ముమ్మలనేని.సునీల్ కుమార్, తాళం.చెన్న, భాజి, గోపి, అన్వర్, షేక్.షబ్బీర్, నామాల.జగదీష్, ముసునూరు మండల కార్యదర్శి మల్లిఖార్జున్, వీరమహిళలు రామిశేట్టి తేజస్విని, రంగు ధనలక్ష్మి, చంద్ర, రావిచెర్ల గ్రామ జనసైనికులు కొన్నంగుంట రాంబాబు, తోట. అంజీబాబు, తోట బలరాం, కస్తూరి అశోక్, శ్రీకాంత్, బాలాజీ, అభి పలువురు జనసైనికులు పాల్గొన్నారు.