జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇంచార్జి బొమ్మిడి నాయకర్

భీమవరం నియోజకవర్గం: భీమవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో ప్రజా వేదికపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన విమర్శలను ఖండిస్తూ భీమవరం జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు(చినబాబు) నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యలను తిప్పి కొట్టిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. ఈ సందర్భంగా నాయకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా రాజకీయంలో విమర్శలు రాజకీయ పరంగానే ఉండేవని, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ముఖ్యమంత్రి మరియు వారి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలకే పాల్పడుతున్నారు అని మండిపడ్డారు. జగన్ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న ఒక చీడ పురుగు అని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ యువతకు సరైన ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థత పాలన జగన్ చేస్తున్నాడు అని మండిపడ్డారు. జగన్ రాక్షస పాలన సహించలేక అలాగే రాష్ట్రంలో ఉపాధి లేక ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళ్ళే పరిస్థితి చూస్తున్నాం అని తెలియజేశారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలకోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం అని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని తెలియజేశారు.