బొబ్బిలి జనసేనలోకి యువత చేరిక

బొబ్బిలి నియోజకవర్గం: జనసైనికుల నిలయంలో బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్ మరియు కారాడ గ్రామం శివ, సతీష్ ఆధ్వర్యంలో మంగళవారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు చేతుల మీదుగా బొబ్బిలి మండలం కారాడ గ్రామం నుంచి యువత జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లంక రమేష్, పల్లెం రాజా, అడబాల నాగు, పొట్నూరు జన, చీమల సతీష్, అల్లు రమేష్, జగన్నాధం, జాన్, గార గౌరీ శంకర్, కిలారి అనంత్ తదితరులు పాల్గొన్నారు.