పోలింగ్ శాతాన్ని పెంచండి

తిరుపతి: శనివారం జరిగిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు మీడియా సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శి ఏ.యం.రత్నం, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డా. హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుపతిలో విద్యావంతులు, మేధావులు తప్పకుండా ఓటు వేయండి, తిరుపతిలో పోలింగ్ శాతాన్ని పెంచండి.
జగన్ లాంటి దుర్మార్గుడి రాక్షస పాలన నుండి ప్రజలే కాపాడాలి. ఈరోజు అన్ని సర్వేలు ఎన్డీయే కూటమి రాబోతోంది. తిరుపతిలో గంజాయి, దందాలు పోవాలి, పోతాయి. భూమన తిరుపతిని దొంగవోట్లకు అడ్డాగా మారిపోయాయి అని తెలిపారు.