పాలకొండ జనసేన కార్యాలయంలో స్వాత్యంత్ర దినోత్సవ వేడుకలు

పాలకొండ నియోజకవర్గం: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలలో పార్టీ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు, కూరంగి నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు. అనంతరం స్వాతంత్రం తెచ్చిన త్యాగమూర్తులను గుర్తు చేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో
పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.