రాజంపేట జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రాజంపేట నియోజకవర్గం: రాజంపేటలోని తిరుపతి రోడ్డు ఇండియన్ గ్యాస్ ప్రక్కన ఉన్న జనసేన ప్రధాన కార్యాలయంలో మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగ ఫలితాల వలన మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కూడా ప్రజలు ఎక్కడా స్వతంత్రంగా జీవించలేదని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, కడప జిల్లా లీగల్సేల్ ఉపాధ్యక్షులు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయకులు కోలాటం హరి, నంద్యాల హరి, బాల సాయి, భాస్కర పంతులు, వెంకటయ్య, వెంకటేశ్వరరావు, ఆచారి, గోపి, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీరమహిళలు పోలిశెట్టి రజిత, జడ్డా శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.