కొత్తపల్లిలో ఘనంగా భారత స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకలు..
కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం, కొత్తపల్లి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జండాను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలోని మాస్టర్లు పాల్గొని వారు మాట్లడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేశారు. కొత్తపల్లి యువత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా పాల్గొనడం చాలా ఆనందం వ్యక్తం చేశారు. కొత్తపల్లి యువత చేస్తున్న సేవకార్యక్రమాలు కూడా అభినందించారు. స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కోరారు. కొత్తపల్లి యువత మాట్లడుతూ రాబోయే రోజులో సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తూ కొత్తపల్లి ప్రజలకు మరింత సేవలు అందించే విధంగా ముందుకు సాగుతాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామంలోని స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, కొత్తపల్లి జనసైనికులు, గ్రామ ప్రజానీకం పాల్గొన్నారు.