ముత్త శశిధర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు
కాకినాడ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్త శశిధర్ ఆధ్వర్యంలో ఏటిమొగ ప్రాంతంలోని మత్స్యకార యువకులు వనమాడి ఆనంద్ మరియు వారి యొక్క మిత్రబృందం జనసేన పార్టీలో చేరడం జరిగినది. వీరికి కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్త శశిధర్ జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ముత్త శశిధర్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, స్మార్ట్ ఏటిమొగ చేయడమే జనసేన పార్టీ లక్ష్యమని అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-23-at-19.12.01-1024x472.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-23-at-19.12.01-1-1024x472.jpeg)