జనసేనను గెలిపిస్తే నెల్లిమర్లలో పారిశ్రామిక అభివృద్ధి: లోకం మాధవి
నెల్లిమర్ల, వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీని, తననూ ఆదరించాలని నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి ప్రజలను అభ్యర్ధించారు. నెల్లిమర్ల మండలం, నెల్లిమర్ల టౌన్ పరిధిలోని కీర్తి వీధి, చందక వీధిలో ఇంటి ఇంటికి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ ఈ ప్రాంతం చాలా వెనకబడి ఉంది అని కనీస మౌళిక సదుపాయాలు కరువు అయ్యాయని ఎద్దేవా చేశారు. అలాగే ఇక్కడి ప్రజలు తమది గ్రామ పంచాయితీయో నగర పంచాయతీ పరిధో అర్ధం కావట్లేదు అని తమకు పథకాల ధృవీకరణ లోనూ ఈ సమస్య వస్తోంది అని అక్కడి ప్రజలు విన్నవించుకున్నారు. వచ్చే ఎన్నికలలో తనకు పట్టం కడితే సుస్థిర పాలన అందిస్తామని చెప్పారు. నెల్లిమర్ల నియోకవర్గంలోని యువతకు ఉద్యోగ కల్పన చేయడంతో పాటు, సంక్షేమానికి కూడా పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. అవినీతి రహిత పాలన జనసేనకే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శ్రీమతి లోకం మాధవికి వారి సమస్యలు విన్నవించుకున్నారు. కాలనీలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని, వీధి దీపాలు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. అలాగే ఈ వై.సీ.పీ పాలనతో తాము విసుగు చెందామని వచ్చే ఎన్నికలలో నియోజకవర్గంలో మీకు ఓటు వేసి తద్వారా పవన్ కళ్యాణ్ ని ముఖ్య మంత్రిగా చేసుకుంటామని తెలియచేశారు. వారి మాటలకు స్పందిస్తూ లోకం మాధవి ముందు మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమమని కొరతాం అని, పరిష్కారం అవ్వని యెడల తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాసు, సంతోష్, గాంధీ, శ్రీను, గిరి, పండు, కనకరాజు, శేఖర్, నాగరాజు, హరి మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-28-at-13.19.22-1-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-28-at-13.19.22-2-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-28-at-13.19.24-1024x682.jpeg)