గాదె వెంకటేశ్వరరావు ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

గుంటూరు మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 41 అడవి తక్కెళ్లపాడులో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు జరుగుతుండగా. రెండవ రోజు ఆదివారం గుంటూరు మున్సిపాలిటీ అడవి తక్కెళ్ళపాడు లో జగనన్న ఇల్లును సందర్శించిన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా నాయకులు కొర్రపాటి నాగేశ్వరావు, సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్, తన్నీరు గంగరాజు, కోడిగంటి రవి, మహంకాళి శ్రీను, పతేళ్ళ మల్లీ, బ్రాహ్మం, దాసరి వెంకటేశ్వరావు, గోపిశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.